ఎదురు కాల్పులు మహిళల భద్రతకు భరోసా

ఎదురు కాల్పులు మహిళల భద్రతకు భరోసా

భోపాల్: దిశ కేసులో నిందితుల్ని పోలీసులు ఎదురు కాల్పుల్లో హతం చేసి బాధిత కుటుంబానికి సముచిత న్యాయం చేశారని భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి శుక్రవారం ట్వీట్లో ప్రశంసించారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ తావాదులను కదిలించిన సంఘటన ఇది . ఈ ఏడాది చివరిలో జరిగిన అత్యంత పాశవిక నేరం. మహిళలను వేధించే కామాం ధులకు ఇదో గుణపాఠం. నిందితులు అదే ప్రాంతంలో చావడం వల్ల దిశ ఆత్మ శాంతిస్తుంది. పోలీసుల చర్యలు మహిళలకు ఎంతో భద్ర త ఇస్తాయి. ధైర్యాన్ని ప్రోది చేస్తాయి. నేరస్తులకు సత్వర గుణపాఠం చెప్పేలా తెలంగాణ పోలీసులు వ్యవహరించారు. ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి శుభాభినందనలు. జై తెలంగాణ పోలీస్ అని’ సందేశాన్ని ముగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos