ఇయర్ ఫోన్స్ తో రైల్వే ట్రాక్ పై నడక..50 ముక్కలైన శరీరాలు..

ఇయర్ ఫోన్స్ తో రైల్వే ట్రాక్ పై నడక..50 ముక్కలైన శరీరాలు..

చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై నడుస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురైన ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. రైలు ఢీకొన్న తర్వాత వీరి శరీరాలు 50 ముక్కలై, రైల్వే ట్రాక్‌‌కు సుమారు వంద మీటర్ల దూరం వరకూ చెల్లాచెదురుగా పడిపోయాయి. వీటిని గమనించిన స్థానికులు రైల్వే‌ట్రాక్ వద్దకు‌ చేరుకుని మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ రూటులో నడిచే రైళ్లకు అంతరాయం ఏర్పడింది.బిరోదాకు చెందిన ఇర్ఫాన్ (17), కలీమ్ (16) స్నేహితులు. ఇద్దరూ శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో పటోండా గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై నడుస్తున్నారు. ఈ సమయంలో వారు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్‌లో ఏదో వింటున్నారు. ఇంతలోనే వారు ఊహించని విధంగా భూసావల్ నుంచి బెంగళూరు వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో వచ్చింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో ఇర్ఫాన్, కలీమ్‌లను రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు ముక్కలు ముక్కలై చెల్లాచెదురయ్యాయి.ఈ ఘటన గురించి ఉన్నతాధికారులకు లోకోపైలట్ సమాచారం అందజేశాడు. కొంత దూరం నుంచి వారిని గమనించి, తాను హారన్ మోగించినప్పటికీ వినిపించుకోలేదని డ్రైవర్ తెలియజేశాడు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని వివరించాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముక్కలు ముక్కలైన మృతదేహాలను సేకరించి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos