తుపాకి కాల్పులు- ఇద్దరు మృతి

తుపాకి కాల్పులు- ఇద్దరు మృతి

పులివెందుల : పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో మంగళవారం ఉదయం సంభవించిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు హత్యకు మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.గురి కాగా నల్లపురెడ్డిపల్లి గ్రామంలో వైసిపి కి చెందిన దాయాదులు పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి (62) కుటుంబాల మధ్య పాతకక్షలు ఉన్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ప్రసాద్ రెడ్డి ఇంటి పైకి మచ్చు కత్తి తీసుకొని పార్థసారధి రెడ్డి దాడి చేయబోయాడు. తనను చంపుతాడేమోనన్న ఆందోళనలో ప్రసాద్ రెడ్డి (కాబోయే మండలాధ్యక్షుడు) తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారధి రెడ్డి పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అదే తుపాకీతో ప్రసాద్ రెడ్డి కూడా తన లైసెన్సు రివాల్వర్ తో తనను తానే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos