పేదలకు వెంకన్న భోజనం

పేదలకు వెంకన్న భోజనం

తిరుపతి : కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రతి పూటా యాభై వేల ఆహార పొట్లాల్ని తితిదే వితరణ చేయనుంది. ఇక్కడి నిరు పేదలకు, పని లేని దిన సరి కూలీలకు అన్నదానంలో ఉన్న సరుకులతో భోజన పొట్లాలను పంపిణీ చేయాలని శాసన సభ్యుడు కరుణాకర రెడ్డి చేసిన వినతికి తితిదే సానుకూలంగా స్పందించింది. శనివారం 20 వేల భోజన పొట్లాలు తయారు చేయించారు. తదుపరి ప్రతి పూటా 50 వేల భోజన పొట్లాల పంపిణీకి యంత్రంగాన్ని సిద్ధం చేసినట్లు తితిదే కార్యానిర్వహణాధికారి సింఘాల్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos