ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు  ఊరట

హైదరాబాదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసులో నిందితులైన నందు, సింహయాజీ, రామచంద్ర భారతి కి హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిట్ విచారణకు సహకరించాలని, ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 6 లక్షల పూచీకత్తును సమర్పించాలని తెలిపింది. ముగ్గురి పాస్జ పోర్టులను పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేయాలని ఆదేశించింది. నిందితులు బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ నిరాకరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ముగ్గురికి బెయిల్ మంజూరైనా కేవలం సింహయాజీ మాత్రమే గురువారం విడుదల కానున్నారు. రామచంద్ర భారతి, నందులపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో లో ఇతర కేసులు ఉన్నాయి. ఈ కేసుల విషయంలో వారిద్దరూ రిమాండ్ లో ఉన్నారు. దీంతో, వారు ఆయా కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు వేసుకోవాల్సి ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos