త్రిష పై పోలీసులకు ఫిర్యాదు

త్రిష పై పోలీసులకు ఫిర్యాదు

భోపాల్: ఇండోర్ లో జరుగుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రీకరణలో ఒక దేవాలయంలో త్రిష చెప్పులు వేసుకుని తిరిగినందుకు అక్కడి హిందూ సంఘాలు మండిపడ్డాయి. శివుడు, నంది విగ్రహాల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అప్పుడు ఆమె చెప్పులు వేసుకోవటం వివాదానికి కారణం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయంలో చెప్పులు ఎలా వేసుకుంటారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసాయి. హిందువుల మనో భావాల్ని గాయ పరిచినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ విద్యామండల్ సంస్థ అధ్యక్షుడు దినేశ్ కట్టోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos