తోడు కోసం ఆరు జిల్లాలు తిరిగిన పెద్దపులి..

తోడు కోసం ఆరు జిల్లాలు తిరిగిన పెద్దపులి..

మగ పులి, ఆడతోడు కోసం ఏకంగా 150 రోజుల పాటు 1,300 కిలోమీటర్ల దూరం తిరిగింది. ఇందులో భాగంగా మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని ఆరు జిల్లాల్లో పులి ప్రయాణించింది. చివరకు బుల్డానా జిల్లాలోని ధ్యానగంగ అభయారణ్యానికి చేరి, అక్కడ తన ప్రయాణాన్ని ఆపింది. ఆసక్తికర విషయాన్ని అటవీ శాఖాధికారులు వెల్లడించారు.2016లో తిపేశ్వర్ పులుల అభయారణ్యంలో మూడు పులులు జన్మించాయి. వీటికి అధికారులు సీ-1, సీ-2, సీ-3 అని పేర్లు పెట్టారు. వీటికి ఇప్పుడు మూడేళ్లు. ఆడ తోడును, తనకంటూ ప్రత్యేక ప్రదేశాన్ని వెతుక్కుంటూ మగ పులులైన సీ-1, సీ-3 బయలుదేరాయి. వీటి కదలికలను పరిశీలించేందుకు అధికారులు రేడియో కాలర్లు అమర్చారు. గత జూన్ లో తిపేశ్వర్ ను దాటిన ఇవి, పంధార్ కవాడా డివిజన్ మీదుగా తెలంగాణకు చేరాయి. సీ-3 అనే పెద్దపులి, ఆదిలాబాద్ పట్టణం శివార్ల వరకూ వచ్చింది. సీ-1 అనే పులి అంబాడీ ఘాట్, కిన్వాత్ అడవుల ద్వారా ఆదిలాబాద్ డివిజన్ కు వచ్చింది. సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్రాష్ట్ర అడవుల్లో ఎన్నో రోజులు ఉన్న ఇవి, ఇప్పుడు ధ్యానగంగ అభయారణ్యానికి చేరుకున్నాయి. వందలాది గ్రామాలను దాటిన ఇవి, మానవులపై దాడికి దిగలేదని, ఆకలి వేసినప్పుడు పశువులపై దాడులు చేశాయని అధికారులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos