తైపీ అమ్మాయి చేతిలో ఓడిన పీవీ సింధు

తైపీ అమ్మాయి చేతిలో ఓడిన పీవీ సింధు

కౌలాలంపూర్ : ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ బ్యాడ్మిం టన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోనే మన క్రీడాకారిణి, ప్రపంచ బ్యాడ్మింటన్ షిప్ విజేత సింధు వెనుదిరిగింది. ఇక్కడి అక్సియాటా ఎరీనా ఇండోర్ స్టేడియంలో జరిగిన పోరులో సింధు 16-21, 16-21 తో వరుసగా చైనీస్ తైపీ క్రీడాకారిణి తై ఝు యింగ్ చేతిలో ఓటమిపాలైంది. తై ఝు ధాటికి సింధు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ పోటీలో భారత పురుషుల పోరాటం రెండో రౌండ్ తో సమాప్తి అయింది. కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ వంటి స్టార్ ఆటగాళ్లు తొలిరౌండ్ లోనే బోర్లా పడగా, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ రెండో రౌండ్ లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos