అంచెట్టిలో మంచి దొంగలు

అంచెట్టిలో మంచి దొంగలు

హోసూరు : దొంగల్లో కూడా మంచి దొంగలు కూడా ఉంటారనే చెప్పుకోవాలి. టాస్మాక్ దుకాణంలో దొంగిలించిన మద్యం బాటిళ్లను గుట్టు చప్పుడు కాక వారం రోజుల తరువాత తిరిగి దుకాణం ముందు ఉంచి వెళ్లిన సంఘటన దీనికి నిదర్శనం. వివరాల్లోకి వెళితే… కృష్ణగిరి జిల్లా అంచెట్టిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వారం రోజుల కిందట రూ.లక్షకు పైగా విలువ చేసే 16 బాక్సుల్లో ఉన్న మద్యం బాటిళ్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సంఘటనపై అంచెట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మద్యం దుకాణం తలుపునకు వేసిన తాళం పగులగొట్టి మద్యం బాటిళ్లను చోరీ చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు గాలింపును ముమ్మరం చేయడంతో భయాందోళనలకు గురై న దొంగలు మంగళవారం రాత్రి 13 బాక్సుల్లో ఉన్న మద్యం బాటిళ్లను టాస్మాక్ దుకాణం ముందు పెట్టి వెళ్లారు. 16 బాక్సులలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేసిన దొంగలు 13 బాక్సులను దుకాణం ముందు దించి వెళ్లడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దుకాణం ముందు ఉన్న మద్యం బాటిళ్లను చూసిన స్థానికులు అంచెట్టి పోలీసులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మద్యం సీసాలను స్వాధీన పరచుకొని టాస్మాక్ సిబ్బందికి అప్పగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos