హోసూరు : ఇక్కడికి సమీపంలోని గోవింద అగ్రహారం గ్రామంలో గల ఆలయంలోకి దొంగలు చొరబడి హుండీలో డబ్బు, నగలను దోచుకెళ్లారు. హోసూరు పారిశ్రామికవాడ గోవింద అగ్రహారంలో పటాలమ్మ దేవాలయం ఉంది. దొంగలు ఆలయం తలుపునకు వేసిన తాళం పగులగొట్టి హుండీలో ఉన్న సుమారు రూ.50 వేల నగదు, మరో పెట్టెలో అమ్మవారికి ఉపయోగించే రెండు తాళి బొట్లు, వెండి నగలను దోచుకెళ్లారు. ఈ సంఘటనపై గ్రామస్థులు సిప్కాట్ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.