హోసూరు సమీపంలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ పాఠశాల బస్సు..

హోసూరు సమీపంలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ పాఠశాల బస్సు..

హోసూరు సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదానికి గురై 10 మంది విధిద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.హోసూరు రాయకోట రోడ్డు అలెసీభం గ్రామం నుండి హోసూరుకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు 15 విద్యార్థులతో బయలుదేరింది.బస్సు రాయకోట రోడ్డులోని బీర్జేపల్లి గ్రామం వద్ద హోసూరు వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన ఓ లారీ బసుపై ఢీకొనేందుకు వేగంగా వస్తుండగా అప్రమత్తమైన ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ మునిరాజ్ బస్సును రోడ్డుపక్కన గల పొలంలోకి పోనిచ్చాడు.ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది విద్యార్థులు,డ్రైవర్ మునిరాజ్ తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన విద్యార్థులను స్థానికులు హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.తరువాత మెరుగైన చికిత్స కోసం హోసూరులో ని వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.ఉద్దనపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

గాయపడ్డ విద్యార్థి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos