శశిథరూర్ వర్సెస్ వివేక్ అగ్నిహోత్రి

శశిథరూర్ వర్సెస్ వివేక్ అగ్నిహోత్రి

న్యూ ఢిల్లీ : ‘‘భారత అధికార పార్టీ ప్రమోట్ చేసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను సింగపూర్ లో బ్యాన్ చేశారు’’ అంటూ కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ చేసిన ట్వీట్ వివాదాగ్ని సృష్టిం చింది. ‘మూర్ఖ శిఖామణి శశిథరూర్.. ప్రపంచంలోనే అత్యంత చెత్త సెన్సార్ అని సింగపూర్ కు పేరు. ద లాస్ట్ టెంప్టేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే సినిమానూ ఆ దేశం బ్యాన్ చేసింది. కావాలంటే మీ మేడమ్ ను అడుగు. ద లీలా హోటల్ ఫైల్స్ అనే రొమాంటిక్ సినిమానూ నిషేధించింది. కశ్మీరీ హిందువుల ఊచకోతపై జోకులు వేయడం మానుకో’’ అని బదులిచ్చారు. ఆ తర్వాత కశ్మీరీ హిందువుల ఊచకోతపై మాట్లాడొద్దంటూ తన భర్త శశిథరూర్ తన నోరు మూయించారంటూ సునంద పుష్కర్ పాత ట్వీట్ ను పోస్ట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి.. ఇది నిజమేనా? అంటూ ప్రశ్నించారు. ‘‘సునంద పుష్కర్ కశ్మీరీ హిందువా? అదే నిజమైతే ఆమె ఆత్మో క్షోభించకముందే హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి గౌరవం ఇవ్వాలనుకుంటే.. వెంటనే మీ ట్వీట్ ను తొలగించండి. సునందకు క్షమాపణ చెప్పండి’’ అంటూ మరో ట్వీట్ చేశారు. సునంద పుష్కర్ కోసమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, కశ్మీరీ పండిట్లపై కొంత సున్నితంగా ఉండాలంటూ సూచించారు. ఓ దేశం కశ్మీరీ ఫైల్స్ ను నిషేధిస్తే సంబరాలు చేసుకోవడం తగదన్నారు. వారి వ్యాఖ్యలకు శశిథరూర్ వివరణ ఇచ్చారు. ఇంతవరకు చూడని ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాలోని అంశాల గురించి మాట్లాడలేదు. కశ్మీరీ పండిట్లను అవమా నిం చలేదని, వారిపై జరిగిన దారుణాలను తక్కువ చేసి చూపలేదని అన్నారు. ఈ విషయంలోకి చనిపోయిన తన భార్యను లాగడం మంచిది కాదన్నారు. కశ్మీరీ హిందువు లపై ఆమెకున్న అభిప్రాయాలేంటో తన కన్నా ఎక్కువ తెలిసిన వారు ఎవరూ లేరన్నారు. సొపోర్ లోని బొమైలో నాశనమైన తన పూర్వీకుల ఇంటిని తాను కూడా చూశాన ని చెప్పారు. ఆమె చనిపోయిందన్న విషయాన్ని పక్కనపెట్టి ఈ వ్యవహారంలోకి లాగి లబ్ధి పొందడం తగదన్నారు. ఆమె ఎప్పటికీ స్నేహపూర్వక రాజీనే నమ్ముతుందని, ద్వేషాన్ని కాదని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos