‘విద్యుత్’ డిమాండ్లకు సమ్మతించిన యాజమాన్యం

‘విద్యుత్’ డిమాండ్లకు సమ్మతించిన యాజమాన్యం

హైదరాబాదు: తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల డిమాండ్లు తీర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. ‘కార్మిక సంఘాలు, విద్యుత్ సంస్థల సీఎండీలల మధ్య శనివారం రెండు గంటల పాటు జరిగిన చర్చలు ఫల్రదమయ్యాయ’ని 1104 యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా విలేఖ రులకు వెల్లడించారు. జీపీఎఫ్ విధానాన్ని తిరిగి వర్తింపచేయడం, మరికొన్ని డిమాండ్లు తీర్చడానికి యాజమాన్యం కొంత సమయాన్ని కోరిందని అన్నారు. చర్చలు తమకు అనుకూలంగా సాగడంతో కార్మిక సంఘాలు సమ్మెను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ప్రకటించారు. వచ్చే నెలలో మరో సారి యాజమాన్యాలతో చర్చలు కొనసాగించనున్నట్లు ఆయన వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos