కాల్పులతో అత్యాచారాలు ఆగవు

కాల్పులతో అత్యాచారాలు ఆగవు

వరంగల్: అత్యాచారాల నిరోధానికి ఎదురు కాల్పులు పరిష్కారం కాదని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పులతో సమస్యలు తీరవని చెప్పారు. హన్మకొండలో శనివారం జరిగిన తెజస ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘అత్యాచారాలు, హత్యలు తదితర నేరాలను అరికట్టాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. వరంగల్ యువతిపై జరిగిన హత్యాచారంపై వెంటనే విచారణ జరిపించాలి. మృతురాలి కుటుంబా న్ని ఆదుకోవాలి. దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తెలంగాణలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాల్ని ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల’ని డిమాండు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos