చిరాగ్ కు కూటమి స్వాగతం

చిరాగ్ కు కూటమి స్వాగతం

పట్నా: బిహార్ ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పారు ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమదే విజయమని భరోసా వ్యక్తం చేశారు. క్కజాముయ్లో సోమ వారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. అవసరమైతే ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ను కూటమిలో చేర్చుకునేందుకు కూడా సిద్ధమని తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీని భాజపా బీ-టీమ్గా అభివర్ణించారు. పార్టీ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీల్చేందుకు భాజపానే ఈ వ్యూహం రూపొందించినట్లు ఆరోపించారు. ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొకమా, షేక్పుర, జూముయ్, నవాదా ర్యాలీల్లో సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos