సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. బవుమా 35 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో షమీ 3, బుమ్రా 3, సిరాజ్ 2, అశ్విన్ 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా చివరి ఐదు వికెట్లను 30 పరుగుల లోపే కోల్పోయింది.