తెదేపా కి సుప్రీం కోర్టు నోటీసులు

తెదేపా కి సుప్రీం కోర్టు నోటీసులు

న్యూ ఢిల్లీ : మంగళగిరిలో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపులపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మంగళ వారం అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ నారిమన్ ధర్మాసనం విచారణ ఆరంభించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన భూ కేటాయింపులను రద్దు చేయాలనేది కక్షిదారు విన్నపం.ఆయన తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదించారు. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెదేపా, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏకు న్యాయ స్థానం తాఖీదుల్ని జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాల తర్వాత చేపట్టనుంది. గతంలో ఆర్కే వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos