తృటిలో చేజారిన మిస్‌ వరల్డ్‌ కిరీటం..

తృటిలో చేజారిన మిస్‌ వరల్డ్‌ కిరీటం..

లండన్‌ నగరంలోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం రాత్రి అత్యంత వైభవంగా సాగిన మిస్ వరల్డ్ పోటీల్లో భారత్కు చెందిన సుమన్ రావు తృటిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. జమైకాకు చెందిన టోనీఆన్సింగ్‌, 2019 సంవత్సరానికిగాను మిస్వరల్డ్గా ఎంపికైంది. సుమన్ రావు సెకండ్ రన్నరప్ గా నిలువగా, ఫ్రాన్స్ సుందరి ఓప్లి మెజినో ఫస్ట్ రన్నరప్ గా ఎంపికైంది. గత సంవత్సరం మిస్వరల్డ్గా నిలిచిన మెక్సికో అందాల భామ వనెస్సా పొన్స్‌, టోనీఆన్సింగ్తలపై కిరీటాన్ని అలంకరించింది.గత నెల 20 తేదీ నుంచి పోటీలు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 120 దేశాలకు చెందిన అమ్మాయిలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనగా, ఫైనల్స్ కు 10 మంది అర్హత సాధించారు. వీరిని పలు ప్రశ్నలు అడిగిన ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్మోర్గాన్నేతృత్వంలోని బృందం, సమాధానాల ఆధారంగా విజేతలను ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos