ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం మందకొడిగా ఆరంభ మయ్యాయి. ఉదయం 9.37 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్లు తగ్గి 40,761 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు తగ్గి 12,032 వద్ద నిలిచాయి. భారత రిజర్వు బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటును తగ్గిస్తుందని నిపుణుల మదింపు. బజాజ్ ఆటో, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభ పడగా, టాటా స్టీల్, వేదాంతా షేర్లు నష్టపోయాయి.