పవన్‌పై శ్రీరెడ్డి ఘాటు కామెంట్‌..

పవన్‌పై శ్రీరెడ్డి ఘాటు కామెంట్‌..

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఎన్‌కౌంటర్‌పై సొల్లు కబుర్లు చెబుతూ,చిత్రమైన లాజిక్కులు బయటకు తీసి వితండ వాదం చేస్తూ విమర్శలు వ్యక్తం చేస్తున్న ప్రముఖులపై అంతేస్థాయిలో భగ్గుమంటున్నారు.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రజలు మండిపడుతున్నారు.దిశ హత్యాచార నిందితులకు మరణశిక్ష విధించాలన్న డిమాండ్లపై స్పందించిన పవన్‌.. మనుషులను చంపే హక్కు లేదు.. రెండు బెత్తం దెబ్బలతో సరిపెట్టాలని చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.ఈ క్రమంలో మెగా కుటుంబంపై ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌పై ఒంటికాలితో పైకిలేచే శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పవన్‌ను ఉద్దేశించి కామెంట్‌ చేస్తూ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఏపీ పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తన పోస్టులో కోరింది. దిశా కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పింది శ్రీరెడ్డి. అంతేకాదు కేసీఆర్‌కు జేజేలు పలికింది.

Who are marrying 3,4 times like pk also shd get encountered, I request a.p police to do encounter this fellows

Posted by Sri Reddy on Thursday, December 5, 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos