శ్రీలంక యువ క్రికెటర్ మత్తుపదార్థాలతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన చర్చనీయాంశమైంది.2017లో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో మొదటి వన్డే మ్యాచ్లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసి యువ కెరటంలా దూసుకువచ్చిన షెహన్ మధుశంకా స్నేహితులతో కలసి మత్తు పదార్థాలతో పోలీసులకు దొరికిపోయాడు. వైరస్ నేపథ్యంలో మార్చి నుంచి శ్రీలంకలో లాక్ డౌన్ అమల్లో ఉండగా.. ఇటీవల రూల్స్ కొన్ని సడలించారు. కానీ.. ఫ్రెండ్ తో కలిసి కారులో పన్నాల రోడ్డుపై వెళ్తున్న షెహన్ మధుశంకాని ఆపిన పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో షెహన్ మధుశంకా వద్ద 2 గ్రాముల హెరాయిన్ దొరకడంతో అతనిపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయన రెండు వారాల కస్టడీకి ఆదేశించారు.మార్చి 20 నుంచి ఇప్పటి వరకూ శ్రీలంకలో దాదాపు 65 వేల మంది లాక్ డౌన్ నిబంధనల్ని అతిక్రమించి అరెస్టయ్యారు. ఇందులో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉండగా.. క్రికెటర్ కూడా ఆ జాబితాలో చేరడం విశేషం. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా షెహన్ మధుశంకాపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.