షా రాజీనామాకు సోనియా డిమాండ్‌

న్యూఢిల్లీ:’ఢిల్లీలో నెలకొన్న హింసాత్మక సంఘటనలకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ పూర్తి బాధ్యత వహించాలి.విధి నిర్వహణలో విఫలమైనందుకు హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాల’ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఇక్కడ డిమాండు చేసారు. పార్టీ పదాధికార్ల సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడారు.’ఈ హింస వెనుక కుట్ర ఉంది. ఇటువంటి ఘటనలనే ఢిల్లీ ఎన్నికల సమయంలోనూ దేశం యావత్తూ చూసింది.ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా,వారిలో భయపూరిత వాతావరణం నెలకొనేలా భాజపా నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.72 గంటల్లో 18 మంది మృతి చెందారు.వారిలో హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఇప్పటికీ హింస కొనసాగుతోంద’ని ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగుతోన్న హింస కాండలో మృతుల సంఖ్య 20కి చేరింది.189 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జీటీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గౌతమ్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos