కోయంబత్తూరు: నటుడు రజనీ కాంత్కు వ్యతిరేకంగా పోలీసు కేసు దాఖలైంది. ఈ నెల 14న ఇక్కడ జరిగిన తుగ్లక్ పత్రిక వార్షి కోత్సవంలో రజనీకాంత్ ప్రసంగించారు. 1971లో సేలంలో ద్రావిడ పితామహుడు పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతా రాముల ప్రతిమలను నగ్నంగా ఊరేగించారని ఆరోపించారు. దీన్ని ద్రావిడర్ విడుదలై కళగం నేతలు ఖండించారు. పెరియార్ ర్యాలీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. పెరియార్ గౌరవ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆగ్రహించి ఇక్క డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్ను కించపరిచిన రజనీకాంత్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసు కో వాలని ద్రావిడర్ విడుదలై కళగం అధ్యక్షుడు కొళత్తూర్ మణి ఫిర్యాదులో డిమాండ్ చేశారు.