న్యూఢిల్లీ : లాక్డౌన్ వల్ల వలస వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్న క్లిష్ట సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ ప్రశ్నించారు. ‘ప్రజలందరూ లాక్డౌన్ ఉన్న సమయంలో, లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్తున్న సమయంలో, ఇంకా స్వస్థలాలకు చేరుకోని సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా మాట్లాడటం లేదు. కనీసం వారివైపు చూడటం కూడా లేద’ని సిబల్ ధ్వజ మెత్తారు.