భార్యపై అనుమానంతో 17 ఏళ్లుగా ఓ భర్త ఏం చేశాడంటే..

భార్యపై అనుమానంతో 17 ఏళ్లుగా ఓ భర్త ఏం చేశాడంటే..

భార్యపై అనుమానంతో ఓ భర్త చేసిన పనికి భార్యతో పాటు పోలీసులు సైతం షాక్ అయ్యారు.భార్యపై అనుమానంతో గత 17 ఏళ్లుగా కప్ బోర్డులో దాక్కొని ప్రతి రోజు భార్యను గమనిస్తున్నాడు.ఒక రోజు ఇలానే దాక్కొని భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.బెంగళూరుకు చెందిన బాల,రాణి 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజు, రాణికి పరిచయం అయ్యింది. ఒక సంవత్సరం పాటు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని స్నేహంగా ఉన్నారు.పెళ్లి జరిగినప్పటి నుంచి బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలో కాపురం ఉంటున్నారు.ఏడాది వరకు సవ్యంగా సాగిన కాపురంలో అనుమానాలు మొదలయ్యాయి.భార్య పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్న బాల భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ వేశాడు.ఎలాగైనా తన భార్య అక్రమ సంబంధం బయటపెట్టాలని నిర్ణయించుకున్న బాల గత 17 ఏళ్ల నుంచి ప్రతిరోజు ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఉద్యోగానికి వెలుతున్నానని భార్య రాణికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెలుతున్న బాల తరువాత మరో తాళం ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 17 ఏళ్ల నుంచి ఉద్యోగానికి నామం పెట్టి భార్య అక్రమ సంబంధం బయటపెట్టాలని భర్త రాజు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం ఒకసారి భార్య ఏదో పనికిరాని వస్తువులు కబోడ్ లో వెయ్యడానికి దాని డోర్ తీసింది. అంతే అందులో భర్త బాల దాక్కొని ఉన్న విషయం గుర్తించి షాక్ కు గురైయ్యింది. దీనయాపై భర్తను నిలదీయడంతో అప్పటి నుంచి రాజు అతని భార్య రాణిని పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు.తన భార్య యవ్వనంగా, చాలా అందంగా ఉందని, ఎవరైనా ఆమె వలలో పడిపోతారని రాజుకు ఎక్కువ అనుమానం ఉంది. ఇలా భార్య రాణి మీద రోజురోజుకు అనుమానం పెరిగిపోవడంతో రాజు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరికి పాలు వేసే వ్యక్తి, పేపర్ బాయ్ లతో గొడవ పెట్టుకుంటున్న రాజు రచ్చరచ్చ చేసి భార్య రాణి పరువు బజారుకు ఈడ్చడానికి అనేకసార్లు ప్రయత్నించాడని వెలుగు చూసింది.తన చర్యను కప్పి పుచ్చుకోవడానికి తన భార్యకు పిచ్చి పట్టిందని నమ్మించడానికి ప్రయత్నించినా చివరకు బాల చేసిన పని నిజమేనని పోలీసులు సైతం చెబుతున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos