సిగ్గు లేని మాధ్యమాలు

సిగ్గు లేని మాధ్యమాలు

ముంబై : సిగ్గు లేని మాధ్యమాలు అని క్రికెట్ టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి విరుచుకు పడ్డారు. ధోనీ కరోనాపై పోరుకు లక్ష రూపాయలు మాత్రమే ప్రకటించినందుకు విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు సైతం ధోనీని ఎగతాళి చేస్తున్నారు.దీనిపై ధోనీ భార్య సాక్షి ట్విట్టర్లో నిప్పులు చెరిగింది. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాధ్యమాలపై ఆగ్రహించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం కనుమరుగైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాటి వార్తలు ప్రచురిస్తున్నందుకు సిగ్గుగా లేదూ. అని ప్రశ్నించింది. అయితే, ధోనీ వాస్తవానికి ఎంత విరాళాన్ని ప్రకటించాడన్న విషయాన్ని చెప్పక పోవడంతో మ రోమారు విమర్శలు వెల్లువెత్తాయి. పూణెలోని ముకుల్ మాధవ్ ఫౌండేషన్కు క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్ కెట్టో ద్వారా ధోనీ రూ.లక్ష విరాళం అందిం చాడు. రూ. 800 కోట్ల ఆస్తి పరుడైన న ధోనీ కేవలం రూ.లక్ష ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముకుల్ మాధవ్ ఫౌండేషన్కు ధోనీ లక్ష ఇచ్చాడే తప్ప పీఎం సహాయనిధికి కాదని ఓ వార్త సంస్థ వివరించింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos