కలం ప్రియులకు ఖరీదైన కబురు

కలం ప్రియులకు ఖరీదైన కబురు

బెంగళూరు :ఇది సాధారణ కలం కాదు. అసలు సిసలైన వెండితో చేసింది. వెల రూ.2.5 లక్షలు మాత్రమే. అంతర్జాతీయంగా పేరు గాంచిన రాత పరికరాల సంస్థ-అమెరికాకు చెందిన షీఫర్‌ తన  శత వార్షికోత్సవం సందర్భంగా దీన్ని విడుదల చేసింది. కేవలం 516 విన్నూత్న కలాల్ని మాత్రమే తయారుచేసింది. ప్రతి కలం పైనా దాని క్రమ సంఖ్యను చెక్కారు. 18 కేరట్ల బంగారం పూత పూసి మధ్య తరహా పాళీని బిగించారు. మూతను తీసి కలం కింద బిగించ వచ్చు.నేరుగా సిరా పోసి వాడుకోవచ్చు. వద్దనుకుంటే సిరా గొట్టాల్ని కూడా అమర్చుకోవచ్చు.ఫోర్ట్‌ మాడిసన్‌ లోని షీఫర్‌ కర్మగార చరిత్రను చిత్రాలతో ఇది వివరిస్తుంది. సంస్థ స్థాపకులు వాల్టర్‌, క్రెగ షీఫర్‌ ముఖ చిత్రాల్నీ ఇందులో చూడవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos