దూసుకుపోయిన మార్కెట్లు

దూసుకుపోయిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్ని గడించాయి. పాఠశాలలు, సినిమా థియేటర్ల ఆరంభానికి కేంద్రం అనుమతించటం మార్కెట్లను ప్రభావితం చేసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 629 పాయింట్లు పెరిగి 38,697 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు పుంజుకుని 11,416 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (12.41%), బజాజ్ ఫైనాన్స్ (5.11%), యాక్సిస్ బ్యాంక్ (4.44%), బజాజ్ ఆటో (4.19%), టెక్ మహీంద్రా (3.75%) లాభాల్ని గడించాయి. ఐటీసీ (-0.52%), ఎన్టీపీసీ (-0.47%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.39%), టైటాన్ కంపెనీ (-0.26%), ఓఎన్జీసీ (-0.22%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos