424 మందికి భద్రత తొలగింపు

424 మందికి భద్రత తొలగింపు

చంఢిగడ్: రాజకీయ నేతలు, మత పెద్దలు, రిటైర్డ్ పోలీసు అధికారులు 424 మందికి భద్రతను ఉపసంహరించినట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. డేరా రాధ సోమీ బ్యాస్ కు ఉన్న 10 మంది భద్రతా సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఏప్రిల్ లో మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ సహా పలువురు మాజీ మంత్రు లు ఇతర నేతలు సహా 184 మంది భద్రతను ఉపసంహరించుకుంది. ఆ నిర్ణయంతో 400 మంది పోలీసులు మళ్లీ స్టేషన్ విధులకు హాజరవుతున్నారు.. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలిగానీ.. వీఐపీలకు భద్రత పేరుతో జనానికి ఇబ్బందులు కలిగించకూడదని ముఖ్యమంత్రి మాన్ అన్నారు. మరోవైపు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలోనూ మాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై ఎవరైనా ఎన్నిసార్లైనా ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్క పదవీకాలానికి సంబంధించిన పింఛను మాత్రమే వస్తుందని ప్రటకించారు. ప్రస్తుతం నెలకు రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల దాకా పింఛను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలున్నారు., తాము తీసుకున్న నిర్ణయంతో రూ. కోట్లాది ప్రజాధనం ఆదా అవుతోందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos