దక్షిణాఫ్రికాతో సెంచూరియన్లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ఒక బంతి కూడా పడకుండానే రద్దయింది. తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచిన సంగతి తెలిసిందే. మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అజింక్య రహానే సైతం కెప్టెన్ కోహ్లి, హెడ్ కోచ్ ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా 40 పరుగులు సాధించి ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.