ఈ యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ

ఈ యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ

న్యూఢిల్లీ : ఎనీడెస్క్, క్విక్సపోర్ట్, టీమ్వ్యూయర్, మింగిల్వ్యూ యాప్లను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఖాతాదార్లకు సూచించింది. వీటివల్ల ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొందరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకునేలా ఒత్తిడి తెస్తారని.. వాళ్లు చెప్పిన మాట విని ఇన్స్టాల్ చేసుకుంటే నగదు మాయం అవుతుందని వివరించింది. గత నాలుగు నెలల్లో 150 మంది ఎస్బిఐ వినియోగదార్లు మొత్తంగా రూ.70 లక్షలు నష్టపోయారని పేర్కొంది. యుపిఐ ప్లాట్ఫాంలను ఉపయోగించేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మీకు తెలియని నెంబర్ల నుండి క్యూఆర్ కోడ్ లేదా యుపిఐ కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే వాటిని తిరస్కరించాలని వెల్లడించింది. ఎస్బిఐ పేరుతో పలు నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని, తమ హెల్ప్లైన్ లేదా కస్టమర్ కేర్ నెంబర్లను వెతికేటప్పుడు అలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్లకూడదని హెచ్చరించింది. డిజిటల్ లావాదేవీ పూర్తయ్యాక వినియోగదారుకి ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుందని, ఒకవేళ ఆ లావాదేవీ వాళ్లు నిర్వహించకుంటే వెంటనే ఆ ఎస్ఎమ్ఎస్లోని నెంబరుకు ఆ మెసేజ్ను తిరిగి పంపించాలని పేర్కొంది. ఏదేని మోసం జరిగినట్లు గుర్తిస్తే.. 1800111109, 9449112211, 08026599990 కస్టమర్ కేర్ నెంబర్లలో ఎస్బీఐ ఖాతాదార్లు సంప్రదించవచ్చని ఎస్బిఐ తెలిపింది. అలాగే 155620 నెంబరును ఉపయోగించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని వివరించింది. ఏ సమస్య పరిష్కారం కోసమైనా తమ అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలని తెలిపింది.వెబ్సైట్ సరైనదే అని నిర్థారణకు వచ్చాకే, మీ వివరాలు తెలపాలని ఖాతాదార్లకు హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos