న్యూఢిల్లీ: దిశ కేసులో ఎదురు కాల్పుల పూర్తి వివరాలు తెలియకుండా తొందరపడి ఖండించరాదని కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం లోక్సభ సభ్యుడు శశిథరూర్ శుక్రవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ఈ ఎదురు కాల్పులు చట్టానికి అతీతంగా జరిగి ఉండొచ్చంటూ ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్ పై స్పందించారు. ‘సూత్రప్రాయంగా నేను మీతో ఏకీభవిస్తున్నాను. మనం పూర్తి వివ రాలు తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. ఒక వేళ నిందితులు ఆయుధాలు కలిగివుంటే. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పు లు జరపడం సమర్థనీయమే అవుతుంది. కాబట్టి పూర్తి వివరాలు తెలిసే వరకు తొందరపడి దీన్ని ఖండించకూడదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపడం మాత్రం న్యాయ వ్యవస్థ కలిగిన సమాజంలో అమోదయోగ్యం కాద’ న్నారు.