ముంబై:స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా నాలుగో రోజూ నష్టాలతోనే వ్యాపారాన్ని ఆరంభించాయి.ఉదయం 9.55 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 40,004 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు దిగజారి 11,713 వద్ద ఉన్నాయి.డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.94 వద్ద దాఖలైంది.హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కంపె నీల షేర్లు లాభాల్నో గడించాయి. టాటా మోటార్స్, సన్ ఫార్మా, హిందాల్కో, విప్రో, భారతీ ఎయిర్టెల్ నష్ట పోయాయి.