భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎం.ఎస్. ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడంటూ రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ధోనీ సతీమణి సాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు.ధోనీ రిటైర్మెంట్పై వస్తున్న వార్తలపై ట్విట్టర్లో ఘాటుగా ట్వీట్ చేసిన సాక్షి వెంటనే ట్వీట్ను తొలగించారు. రాత్రి 11.57 గంటల సమయంలో ట్వీట్ పెట్టారు. తన భర్త రిటైర్ మెంట్ వార్తలను ఆమె ఖండించినా, వాడిన భాష బాగాలేదని పలువురు అభ్యంతరం పెట్టారు. దీంతో ఆమె తన ట్వీట్ ను డిలీట్ చేశారు.అయితే అప్పటికే కొందరు నెటిజన్లు దీన్ని స్క్రీన్షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది..