ఉద్యోగులు అపోహలు వీడాలి

ఉద్యోగులు అపోహలు వీడాలి

అమరావతి: ‘చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని, పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు సమితిని అడగొచ్చ’ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీపై ప్రభుత్వ సమితి సమావేశానంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం, చర్చలు, సమితిపై అపోహలు వీడాలి. ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయి. కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషం లేదు. ఎక్కడో ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే, మా వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుంది. పీఆర్సీ చాలదని ఉద్యోగులు అంటు న్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు మంచి చేశామో మేము చెబుతున్నాము. అలా కాకుండా ప్రభుత్వ సమితిని గుర్తించబోమని ఉద్యోగులు పేర్కొనడం ప్రతిష్టంభనను మరింత పెంచడమేన’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos