అమరావతి: భూముల వెలలు పడి పోవటం తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడుకు సహించరాని విషయమైందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి శుక్రవారం ట్వీట్లో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్ర బాబు చేస్తున్న వ్యాఖ్యల్లో పస లేదన్నారు. ‘రాజధాని విషయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తి గత విషయంగా ఎందుకు తీసు కుం టున్నాడో ప్రజలకు బాగా అర్థమైంది. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయనేదే అయన ప్రధాన బాధ. ల్యాండ్ మాఫియా కోసమే రాజధాని పర్యటన, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజల కోసం ఏనాడు పని చేసింది లేద’ని దుయ్యబట్టారు.