సాయి పుట్టింది ఎక్కడ?

సాయి పుట్టింది ఎక్కడ?

ఔరంగాబాద్: షిర్డీ సాయి జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని పాథ్రీ పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తామని చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. శివసేన,ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాయి బాబా జన్మస్థలాన్ని వివాదాల్లోకి లాగుతోందని భాజపా ఆరోపించింది. షిర్డీ సాయి జన్మ స్థలం గురించి రాజకీయ జోక్యం కొన సాగితే షిర్డీ ప్రజలు న్యాయ పోరాటానికి దిగుతారని అహ్మద్నగర్ లోక్సభ సభ్యుడు సుజయ్ విఖే పాటిల్ హెచ్చరించారు. ఇక పత్రీని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించినందుకు నిరసనగా షీర్డీ గ్రామస్తులు బంద్కు పిలుపు నిచ్చారు. ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్ స్పష్టీక రిం చింది. బంద్తో ట్రస్ట్కు సంబంధం లేదని తెలిపింది. ఆలయం, భక్తి నివాస్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని సాయిబాబా సం స్థా న్ ట్రస్ట్ అధికారి మోహన్ యాదవ్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos