జైపూర్: కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత సచిన్ పైలెట్, ఆయన అనుచరులు మంగళవారం ఇక్కడ జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి పరిశీలకులు గైరు హాజరయ్యారు. దీంతో నాయకత్వం ఆయన పట్ల ఆగ్రహంగా ఉంది. తమ ఆదేశాల్ని ఖాతరు చేయకుండా ఏక పక్షంగా వ్యవహరించిన మరో అవకాశాన్ని ఇచ్చి చూడదలుస్తోంది. అప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రానపుడు వేటు వేయాలని యోచిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి 104 మంది సభ్యులు హాజరు అయ్యారు. సచిన్ వర్గంలోని ఐదుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతు లేఖ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అది అవాస్తవమని, 30 మంది ఎమ్మెల్యేలూ తమతోనే ఉన్నారని సచిన్ తేల్చి చెప్పారు. గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని పేర్కొన్నారు.