నాడు వెన్ను పోటు…నేడు నక్క వినయం

తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఓ శని అని ఎన్టీఆర్ ఏనాడో అన్నారని పర్యాటక మంత్రి రోజా గుర్తు చేసారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విలేఖరులతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన చంద్రబాబే.. నేడు ఆయన ఫొటోలకు దండలు వేసి దండం పెడుతున్నారు. కనీసం ఈ మహానాడులోనైనా ఎన్టీఆర్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినా చంద్రబాబుకు కృతజ్ఞత లేదు. చేసిన తప్పులను మహానాడు ద్వారా సరిదిద్దుకోకుండా.. కేవలం సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ మాత్రం పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. మా ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకూ లబ్ధి కలుగుతోంది. 95 శాతం హామీలను జగన్ అమలు చేస్తే.. హామీలను అంతర్జాల వేదిక నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు. ఫ్యాన్ గాలి దెబ్బకు చంద్రబాబు, లోకేశ్ లకు పిచ్చెక్కి తిరుగుతున్నారు. మంచి చేశాం కాబట్టే జనాల్లోకి వెళుతున్నాం. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని విమర్శిస్తున్న టీడీపీ, జనసేనలు.. గతంలో అంబేద్కర్ పేరు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేశాయి? మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేయడం అమానుష చర్య. అల్లర్లను పోలీసులు ఎంతో సంయమనంతో కట్టడి చేశారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos