సైనిక లాంఛనాలతో ముగిసిన సంతోష్ అంత్యక్రియలు

సైనిక లాంఛనాలతో ముగిసిన సంతోష్ అంత్యక్రియలు

సూర్యాపేట : గాల్వన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. అధికారులు సంతోష్ యునిఫామ్, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. పార్థివ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు సంతోష్ పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos