లఖ్నవ్: గూండా వికాస్ దూబేను యూపీ పోలీసులు కాల్చి చంపడం సబబేనని హతుడి భార్య రిచా వ్యాఖ్యాణించారు. శని వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘నా భర్త ఘోరాలకు పాల్పడ్డాడు. ఇలాంటి శిక్షకు అర్హుడేన’ని చెబుతూ బోరున విలపించారు. పటిష్ట బందోబస్తు మధ్య వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో జరిగాయి. భార్య, చిన్న కుమారుడు, బావమరిది దినేశ్ తివారీ తప్ప ఇతర కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు.