పదునెక్కుతోంది పోరు

హైదరాబాదు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కావాలన్న ఉద్యమ ఆకాంక్షకు తూట్లు పొడిచిందని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఉత్తరాది వారినే ఎక్కువగా నియమించారని, తెలంగాణ వారి పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్ ఎదుట ముందు నిన్న విద్యార్థులు చేసిన ఆందోళన పై రేవంత్ ఒక ట్వీట్ లో స్పందించారు. ‘మన ఉద్యోగాలు మనకు కావాలన్న ఉద్యమ ఆకాంక్షలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న వివక్షే అందుకు నిదర్శనం. ఈ ఆందోళనలన్నీ తుది దశ ఉద్యమానికి సంకేతాలు. సిద్ధంగా ఉండు కేసీఆర్’’ అని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos