హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో తనకు వ్యతిరేకంగా దాఖలైన ఐదు అభియోగ పత్రాల్ని కలపి ఒకే సారి విచారించాలని ముఖ్య మంత్రి జగన్ మోహనరెడ్డి చేసిన వినతిని సీబీఐ న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ విచారణ ముగిసేంత వరకూ ఈడీ విచారణను నిలిపివేయాలనే మరో వినతినీ నిరాకరించింది. క్విడ్ ప్రోకో కేసుల సంస్థ ప్రతినిధులు శుక్రవారం విచారణకు హాజరు కాలేదు. వారంతా వచ్చే వారం విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.