హైదరాబాద్:కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా నగరంలోని నాలుగు ప్రాంతాలను ప్రమాదకర ప్రదేశాలుగా గుర్తించింది. చందానగర్, కోకాపేట, తుర్కయంజాల్, కొత్తపేట ప్రదేశాల వారు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని నిర్దేశించింది. పద్నాలుగు రోజుల పాటు వీరు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, నిత్యావసరాలు కావాలంటే వారి ఇళ్లకే సరఫరా చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.