పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయను

పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయను

ఎడిఎంకె పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఎడిఎంకె జిల్లా కౌన్సిలర్, హోసూరు ఉత్తర విభాగపు యూనియన్ కార్యదర్శి అయిన బాగలూరు రవికుమార్ అన్నారు. నెల రోజుల క్రితం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎడిఎంకె పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. అందులో భాగంగా హోసూరు ఉత్తర విభాగపు యూనియన్ కార్యదర్శిగా బాగలూరుకు చెందిన రవికుమార్, దక్షిణ విభాగపు యూనియన్ కార్యదర్శిగా పూనపల్లి హరీష్ రెడ్డికి పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ నాయకులుండగా బాగలూరుకు చెందిన రవికుమార్ ను ఉత్తర విభాగపు యూనియన్ కార్యదర్శిగా అధిష్టానం నియమించడం పట్ల పలువురు సీనియర్ నాయకులు అసమ్మతి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నాయకుల అసమ్మతిని సైతం లెక్క చేయక, అధిష్టానం ఉత్తర్వుల మేరకు రవికుమార్ పార్టీ ని బలోపేతం చేయడానికి నడుంబిగించారు.2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హోసూరు ఉత్తర విభాగంలో ఎడిఎంకె పార్టీ బలోపేతానికి గ్రామాలలో పర్యటిస్తూ సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. ఉత్తర విభాగంలోని 85 గ్రామాలలో కొత్తగా ఎడిఎంకె పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యూనియన్ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో హోసూరు నియోజక వర్గాన్ని ఎడిఎంకె పార్టీ ఖాతాలో వేసుకునేందుకు కృషి చేస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. తన నియామకంపై పార్టీలో అసమ్మతి తెలిపిన సీనియర్ నాయకులు కూడా ప్రస్తుతం తనకు సహకరిస్తూ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. .హోసూరు ఉత్తర విభాగంలో సభ్యత్వ నమోదు కార్యక్ర మమే కాకుండా గ్రామాలలో ప్రజా సమస్యలను సైతం పరిష్కరిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos