బెంగళూరు: వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం గోవధ నిషేధం ముసాయిదాను ప్రవేశ పెట్టనుందని కర్ణాటక మాజీ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ.రవి శుక్రవారం ట్వీట్ చేసారు. పెళ్లి పేరుతో మతం మారేందుకు కుదరదని ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కర్నాటకలో అమలు చేస్తామని తెలిపారు. తమ సోదరీమణులను లవ్ జీహాద్ పేరిట మతం మార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.