సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రష్మికకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు‘తో పాటు నితిన్ ‘భీష్మ‘ సినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో పాల్గొననుంది. వీటితో పాటు కన్నడ చిత్రాలకూ సంతకాలు చేసేసింది.టాలీవుడ్ హీరోయిన్ రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. ‘ఈ ఫొటోలో ఒకే ఒక్కటి మిస్ అయింది. అది నా మరో సగం అయిన మంకీ‘ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ మంకీ ఎవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.