గిరిజన యువతిపై ‘హ’త్యాచారం

గిరిజన యువతిపై ‘హ’త్యాచారం

విశాఖ పట్టణం: విశాఖపట్నం జిల్లా, అరకులోయలో ఒక గిరిజన యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేసారు. శనివారం ఉదయాన యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు యువతి మృతదేహాన్ని పరీక్షకు తరలించారు. అరకుకు చెందిన మహేష్ ఇద్దరు పిల్లల తండ్రి. అయినా గత కొంత కాలంగా తమ ప్రాంతానికి చెందిన పుష్ప అనే యువతిని ప్రేమ పేరిట వేధించాడు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. ఆమె నిరాకరించటంతో ఆమె పై పగ బట్టాడు. పథకం ప్రకారం ఆమెను శుక్రవారం రాత్రి మాట్లాడాలని చెప్పి తన ఇంటికి దూరంగా తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బండరాయితో మోది హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మహేష్ ను అనుమానించినట్లు కుటుంబసభ్యులు తెలపటంతో అతనిని విచారించి వాస్తవాల్ని రాబట్టారు. నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అతనిని కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos