ఆంధ్రలో అధికారం తేలిగ్గారాదు

ఆంధ్రలో అధికారం తేలిగ్గారాదు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో భాజపా అధికారాన్ని చేజిక్కించుకోవటం అంత సులభం కాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ అన్నారు. మంగళవారం ఇక్కడ భాజపా రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజు బాధ్యతల్ని చేపట్టిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం అడ్డుకో లేదు. రాజధాని అంశంపై కేంద్రం ఏనాడు జోక్యం చేసుకోలేదు. కేంద్రం తన పరిధిలోనే వ్యవహరించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. ప్రతిపక్ష స్థానాన్ని భాజపా భర్తీ చేయాలి. మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు చూసారు. ఆయన హైదరాబాద్ను వదిలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగింద’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos