రాకేశ్‌ అంతిమ యాత్రలో ఉద్రిక్తత

రాకేశ్‌ అంతిమ యాత్రలో ఉద్రిక్తత

వరంగల్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా శుక్రావారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో పోలీసు కాల్పులకు బలైన రాకేశ్ అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్ ఎంజీఎం నుంచి స్వగ్రామానికి శనివారం ఉదయం రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. టీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆఫీసుకు నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos